MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Phone Bill: జియో, ఎయిర్ టెల్ యూజర్లకు షాక్, మీ ఫోన్ బిల్లు ఇక పెరిగిపోతుంది

Phone Bill: జియో, ఎయిర్ టెల్ యూజర్లకు షాక్, మీ ఫోన్ బిల్లు ఇక పెరిగిపోతుంది

Phone Bill: జియో, ఎయిర్ టెల్ యూజర్లకు షాక్ ఇచ్చే వార్త ఇది. భారతదేశ టెలికాం రంగం మరోసారి టారిఫ్ సవరణలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా అయితే మొబైల్ డేటా ప్లాన్ ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 06 2025, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టారిఫ్ లు పెంచే ఛాన్స్
Image Credit : Pixabay

టారిఫ్ లు పెంచే ఛాన్స్

భారతదేశంలో టెలికాం రంగం అతి పెద్ద వ్యవస్థ. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను విపరీతంగా వాడుతున్నారు. ఇప్పుడు భారతదేశ టెలికాం రంగం మరో రౌండ్ టారిఫ్ సవరణలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా... సమీప భవిష్యత్తులో మొబైల్ డేటా ప్లాన్ ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు పది శాతం డేటా ప్లాన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మనం వాడే ఫోన్ల బిల్లు ప్రతినెలా 10 శాతం పెరుగుతుంది.

23
తక్కువ ప్లాన్లు మాయం
Image Credit : Airtel

తక్కువ ప్లాన్లు మాయం

గత కొన్ని నెలలగా జియో, ఎయిర్ టెల్ నిశ్శబ్దంగా వినియోగదారులపై భారాన్ని మోపుతూ వచ్చాయి. రోజుకి 1gb ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్లను నిశ్శబ్దంగా తొలగించాయి. దీంతో వినియోగదారులు ఎక్కువ ధర పెట్టి డేటా ప్లాన్లను కొనాల్సి వస్తోంది. ప్రీపెయిడ్ డేటా వినియోగదారులు రోజుకు 1.5 జిబి తో మొదలయ్యే ప్లాన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇవి 299 రూపాయల నుండి కనిష్టంగా ప్రారంభమవుతున్నాయి. అంతకు ముందు వీటి ధర 249 రూపాయలు మాత్రమే ఉండేది.

Related Articles

Related image1
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం వస్తే పెరిగే జీతాన్ని ఇలా లెక్క వేయండి
Related image2
Gold vs SIP: ఈ రెండింటిలో ఏది త్వరగా రెట్టింపు అవుతుంది? దేనిలో పెట్టుబడి పెట్టడం లాభం?
33
తెలివిగా పెంచేశారు
Image Credit : Jio

తెలివిగా పెంచేశారు

మొబైల్ కంపెనీల వారు వినియోగదారులు ఎక్కువ డేటా వాడేలా, ఆ డేటాకు కూడా సంతోషంగా డబ్బు చెల్లించేలా ప్రేరేపిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులపై వారికి తెలియకుండానే అధిక భారం పడుతుంది. అలాగే కొన్ని కంపెనీలు తమ వినియోగదారులను నెలవారీ లేదా మూడు నెలలకు ఒకసారి రీఛార్జ్ చేసే ప్లాన్లు తీసుకోమని ప్రోత్సహిస్తోంది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయని కూడా ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది ఇలాంటి రీఛార్జిలనే చేసుకుంటున్నారు. ఇది కూడా మొబైల్ కంపెనీల వారికి కలిసి వచ్చేదే. అయితే భవిష్యత్తులో టారిఫ్ లను 10 శాతం పెంచే విషయంపై ఇంకా మొబైల్ కంపెనీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ దాదాపు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై జియో ఎయిర్టెల్ వంటి వాటినుంచి ఇంకా నిర్ధారణ రావాల్సి ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం వస్తే పెరిగే జీతాన్ని ఇలా లెక్క వేయండి
Recommended image2
Gold vs SIP: ఈ రెండింటిలో ఏది త్వరగా రెట్టింపు అవుతుంది? దేనిలో పెట్టుబడి పెట్టడం లాభం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved