- Home
- Entertainment
- ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
ఓ క్రేజీ డైరెక్టర్ యువ హీరోలకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ వారిలో నలుగురు హీరోలు మాత్రం అడ్రెస్ లేకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శేఖర్ కమ్ముల హీరోలు
హీరోలుగా రాణించాలని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే యువ నటులు చాలా మందే ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. కొందరు హీరోలు కెరీర్ బిగినింగ్ లో సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. ఓ వైవిధ్యమైన దర్శకుడి దర్శకత్వంలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నలుగురు హీరోలు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారు. దర్శకుడు ఎవరో కాదు.. వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల. మరి ఆ హీరోలు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
రాజా
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తొలి సూపర్ మూవీ ఆనంద్. ఈ మూవీలో నటుడు రాజా అబెల్, కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. వీరిద్దరి నటన, కెమిస్ట్రీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. రాజా ఫ్యూచర్ లో ఇంకా పెద్ద హీరో అవుతారు అని భావించారు. కానీ నెమ్మదిగా రాజా ఫేడ్ అవుట్ అవుతూ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
సుమంత్
శేఖర్ కమ్ముల, సుమంత్ కాంబినేషన్ లో గోదావరి చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్. ఆ టైంలో సుమంత్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ వరుస ఫ్లాపుల కారణంగా సుమంత్ జోరు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు సుమంత్ ఒకటి అరా సినిమాలు మాత్రమే చేస్తున్నారు.
వరుణ్ సందేశ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ చిత్రంతో వరుణ్ సందేశ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారు లోకం చిత్రంతో వరుణ్ సందేశ్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. ఆ తర్వాత ఫ్లాపులు మొదలు కావడం వరుణ్ సందేశ్ కి మైనస్ గా మారింది. హీరోగా వరుణ్ సందేశ్ ఫేడ్ అవుట్ అయ్యారు.
అభిజీత్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో అభిజీత్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ మూవీ పర్వాలేదనిపించింది. అభిజీత్ లుక్స్, నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ హీరోగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. ఆ మధ్యన బిగ్ షోలో పాల్గొని విజేతగా నిలవడం మాత్రమే చెప్పుకోదగ్గ అంశం.
మిగిలింది ఒక్కడే
శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యువ హీరోల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుని రాణిస్తున్నది ఒక్కడు మాత్రమే. అది హీరో నిఖిల్. నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు పొందారు. కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

