MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... ముఖేష్ అంబానీ కంపెనీలో ఉద్యోగాలే ఉద్యోగాలు

Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... ముఖేష్ అంబానీ కంపెనీలో ఉద్యోగాలే ఉద్యోగాలు

తెలుగు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే భారీ ప్రాజెక్టుతో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ముందుకువచ్చారు. ఏపీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్ సంస్థ సిద్దమవగా కూటమి ప్రభుత్వ అనుమతులు కూడా లభించాయి.   

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 27 2025, 10:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
Image Credit : Getty

ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు

Reliance : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో నంబర్ వన్ గా ఉండాలని అనుకుంటారు. ఇలా టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసింది. ఇక పెట్రోలియం, పెట్రో కెమికల్స్, రిటైల్, టెక్స్ టైల్స్, మీడియా రంగాల్లోనూ తనదైన మార్కెటింగ్ స్ట్రాటజీతో దూసుకుపోతోంది రిలయన్స్. ఇప్పుడు శీతల పానియాల విభాగంలో భారీ పెట్టుబడులకు సిద్దమయ్యింది రిలయన్స్.

ప్రస్తుతం మార్కెట్ లో పెప్సీ, కోకాకోలా కంపనీలు ఈ కూల్ డ్రింక్స్ వ్యాపారాన్ని శాసిస్తున్నారు. వీటికి పోటీగానే రిలయన్స్ రంగంలోకి దిగింది. రాబోయే ఏడాది ఏడాదిన్నరలో దాదాపు రూ.8 వేల కోట్ల వరకు ఈ శీతల పానియాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని... ఇందుకోసం దేశవ్యాప్తంగా తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇలా రిలయన్స్ తీసుకున్న నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్ కు వరంగా మారింది.

25
ఆంధ్ర ప్రదేశ్ లో రిలయన్స్ భారీ పెట్టుబడులు
Image Credit : Asianet News

ఆంధ్ర ప్రదేశ్ లో రిలయన్స్ భారీ పెట్టుబడులు

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ 2022 లో శీతల పానియాల వ్యాపారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాంపా, సోస్యో వంటి సాప్ట్ డ్రింక్స్ తో పాటు స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్, సన్ క్రష్ జ్యూస్, ఇడిపెండెక్స్ వాటర్ బాటిల్స్ ను తయారుచేస్తోంది. వీటి ఉత్పత్తిని మరింత పెంచేందుకు, దక్షిణాదిన మార్కెట్ ను విస్తరించేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ లో నూతన ప్లాంట్ ఏర్పాటుకు సిద్దమయ్యింది.

Related Articles

Related image1
Gold: ఎక్కువ లాభాలు రావాలంటే బంగారం కన్నా అక్కడ పెట్టుబడి పెట్టడమే మంచిదా? నిపుణులు ఏమంటున్నారంటే?
Related image2
Mukesh Ambani: అంబానీ మరో సంచలనం.. జియో ఫైనాన్షియల్, బ్లాక్‌రాక్ భాగస్వామ్యంతో పెట్టుబడి రంగంలో విప్లవం
35
రిలయన్స్ ప్లాంట్ ఏర్పాటుకు కూటమి సర్కార్ అనుమతులు
Image Credit : Getty

రిలయన్స్ ప్లాంట్ ఏర్పాటుకు కూటమి సర్కార్ అనుమతులు

ఇప్పటికే రిలయన్స్ సంస్థ ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వ అనుమతులు కోరింది. శీతల పానియాలు, పండ్ల రసాలు తయారీ ప్లాంట్ ఏర్పాటుకోసం చేసిన ఈ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదించింది. ప్లాంట్ ఏర్పాటుకు భూమిని కేటాయిస్తూ ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

45
కర్నూల్ జిల్లాలో రిలయన్స్ ప్లాంట్
Image Credit : ANI

కర్నూల్ జిల్లాలో రిలయన్స్ ప్లాంట్

కర్నూల్ జిల్లా ఓర్వకల్లు దగ్గర ఈ రిలయన్స్ ప్లాంట్ ఏర్పాటుకు 80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అలాగే రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా భారీ పెట్టుబడులకు సిద్దమైన రిలయన్స్ సంస్థకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇలా రిలయన్స్ డిసెంబర్ 2026 నాటికి ప్లాంట్ ఏర్పాటు పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయి.

55
రిలయన్స్ ప్లాంట్ తో ఏపీ ప్రజలకు కలిగే లాభాలు
Image Credit : Gemini

రిలయన్స్ ప్లాంట్ తో ఏపీ ప్రజలకు కలిగే లాభాలు

వ్యాపారరంగంలో పెట్టుబడులు రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి ఊతం ఇస్తాయి. ఇలా రిలయన్స్ పెట్టుబడులు కూడా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అలాగే రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఉపయోగపడతాయి.

రిలయన్స్ సంస్థ ఓర్వకల్లులో శీతల పానియాల తయారీ, ప్యాకింగ్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1622 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్లాంట్ ఏర్పాటుద్వారా దాదాపు 1200 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాల లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక పరోక్షంగా మరెంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
Recommended image2
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?
Recommended image3
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Related Stories
Recommended image1
Gold: ఎక్కువ లాభాలు రావాలంటే బంగారం కన్నా అక్కడ పెట్టుబడి పెట్టడమే మంచిదా? నిపుణులు ఏమంటున్నారంటే?
Recommended image2
Mukesh Ambani: అంబానీ మరో సంచలనం.. జియో ఫైనాన్షియల్, బ్లాక్‌రాక్ భాగస్వామ్యంతో పెట్టుబడి రంగంలో విప్లవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved