Tirupati Sri City: తిరుపతిలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలం (సెజ్) లో LG రూ.5,001 కోట్లతో మూడో ఇండియా ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఎల్జీకి పుణే, నోయిడాల్లో ప్లాంట్లు ఉండగా, ఇప్పుడు ఏర్పాటు కాబోయేది భారతదేశంలో మూడో ప్లాంట్గా నిలవనుంది.
Tirupati Sri City: తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలంలో (SEZ) దక్షిణ భారతదేశంలో తన తొలి తయారీ ప్లాంట్ను LG ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయనుంది. రూ.5,001 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మాణానికి మే 8న భూమి పూజ జరగనుంది. ప్రస్తుతం LGకి పుణే, నోయిడాల్లో ప్లాంట్లు ఉండగా, ఇప్పుడు ఏర్పాటు కాబోయేది భారతదేశంలో మూడో ప్లాంట్గా నిలవనుంది.
శ్రీ సిటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి TNIEకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కలిసి ఈ పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి కృషి చేశారని తెలిపారు. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని అన్నారు.
శ్రీ సిటీలో ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 235కి పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు కలిపి సుమారు $4.5 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వీటి ద్వారా 65,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించారు. వీరిలో 52 శాతం మంది మహిళలే కావడం విశేషం.
తిరుపతి శ్రీ సిటీలోని ప్రముఖ పరిశ్రమలు ఇవే
- Colgate-Palmolive: రోజుకు 2 మిలియన్ టూత్ బ్రష్ల ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే టూత్ బ్రష్లలో 40% వాటాను కలిగి ఉంది.
- PepsiCo: దేశంలో అతిపెద్ద తయారీ కేంద్రంగా ఉంది. మామిడి గుజ్జు సేకరణ ద్వారా 32,000 రైతులకు లాభం కలుగుతోంది.
- Kimberly-Clark & Unicharm: హైజీన్ ఉత్పత్తులతో ప్రపంచ జనాభాలో 25% మందికి రోజువారీ సేవలు అందిస్తోంది.
- Daikin, Bluestar, Havells, Amber, Epack: 2027 నాటికి దేశంలో ఉత్పత్తయ్యే ఏసీలలో 50%, ఎగుమతుల్లో 80% శ్రీసిటీ నుంచే వస్తాయని అంచనా.
- Isuzu Motors: 2024-25లో 20,312 వాణిజ్య వాహనాలను ఎగుమతి చేసింది.
- BFG India: వందే భారత్ ట్రెయిన్లకు FRP భాగాలు, ఇండియా వాటర్ మెట్రోకు 25 మీటర్ల పొడవైన సూపర్స్ట్రక్చర్ అందించింది.
- Astrotech Steels: నెలకు 170 కంటైనర్లు USA, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్కి ఎగుమతి చేస్తుంది.
- Blue Star Climatic, Daikin: వెస్ట్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా వరకు ఎగుమతులకు లక్ష్యం.
జపాన్కు చెందిన 30కి పైగా కంపెనీలతో శ్రీ సిటీ, దేశంలో రెండవ అతిపెద్ద జపాన్ పెట్టుబడి కేంద్రంగా ఎదిగింది. ఈ వృద్ధి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమ విజయాన్ని ప్రతిబింబిస్తోంది. శ్రీసిటీ తయారీ రంగంలో భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా నిలిపే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.
