MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం: గంభీర్‌తో విభేదాలు? వన్డే కెరీర్‌ ప్రశ్నార్థకం !

విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం: గంభీర్‌తో విభేదాలు? వన్డే కెరీర్‌ ప్రశ్నార్థకం !

Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ సిరీస్ తర్వాత రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ లో ఆడటానికి కోహ్లీ నిరాకరించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 02 2025, 10:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దక్షిణాఫ్రికా సిరీస్ మధ్యలో సంచలన అప్‌డేట్
Image Credit : Getty

దక్షిణాఫ్రికా సిరీస్ మధ్యలో సంచలన అప్‌డేట్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాంచీ గ్రౌండ్ లో జరిగిన తొలి మ్యాచ్‌లో చారిత్రక సెంచరీతో మెరిశాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఒక కీలక అప్‌డేట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. కోహ్లీ తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం టీమ్ ఇండియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ నిర్ణయం కారణంగా జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో అతని సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉందని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. పలు మీడియా రిపోర్టుల ప్రకారం, రాబోయే దేశవాళీ 50 ఓవర్ల టోర్నమెంట్‌లో ఆడటానికి విరాట్ కోహ్లీ నిరాకరించారు.

26
సీనియర్లపై బీసీసీఐ కఠిన వైఖరి
Image Credit : Facebook/Indian Cricket Team

సీనియర్లపై బీసీసీఐ కఠిన వైఖరి

కొన్ని రోజుల క్రితం, బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో ఆడటంపై సీనియర్ ఆటగాళ్లందరికీ బోర్డు ఒక స్పష్టమైన ఆదేశాన్ని జారీ చేసింది. ముఖ్యంగా, కేవలం ఒక ఫార్మాట్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడాలని బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది.

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సైతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయం కలకలం సృష్టిస్తోంది.

Related Articles

Related image1
వీరి పేర్లు చెబితేనే బౌలర్లకు వణుకు.. కోట్లు కుమ్మరిస్తామంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
Related image2
డిసెంబర్ 7న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి? క్లారిటీ వచ్చింది !
36
విరాట్ కోహ్లీ-గంభీర్ మధ్య మళ్లీ ఫైట్
Image Credit : ANI + X/@CricCrazyJohns

విరాట్ కోహ్లీ-గంభీర్ మధ్య మళ్లీ ఫైట్

మీడియా వర్గాల సమాచారం ప్రకారం, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కోచ్ గౌతమ్ గంభీర్‌తో అతనికి విభేదాలు తలెత్తినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. బీసీసీఐకి సన్నిహితంగా ఉండే ఒక విశ్వసనీయ వర్గం తెలిపినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి.

"విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడరు. అయితే, రోహిత్ శర్మ మాత్రం తన లభ్యతను ఇప్పటికే ధృవీకరించారు" అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సహచర సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టోర్నీలో పాల్గొనడానికి అంగీకరించిన నేపథ్యంలో, కోహ్లీ నిరాకరించడంతో కొత్త చర్చ మొదలైంది.

46
ప్రమాదంలో కోహ్లీ వన్డే భవిష్యత్తు
Image Credit : Facebook/Indian Cricket Team

ప్రమాదంలో కోహ్లీ వన్డే భవిష్యత్తు

విరాట్ కోహ్లీ గనుక రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఆడకపోతే, అతని వన్డే ఫ్యూచర్ ప్రమాదంలో పడవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు, రోహిత్ శర్మ ఆడటానికి అంగీకరించడం కోహ్లీకి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

సీనియర్ ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ ఇప్పటికే స్పష్టమైన షరతు విధించారు. ఈ కీలక షరతు నేపథ్యంలో, కోహ్లీ తన వన్డే కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

56
నెట్ సెషన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
Image Credit : X/BCCI

నెట్ సెషన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్‌లో జరగనున్న రెండో వన్డేకు ముందు ఫ్లడ్‌లైట్ల కింద జరిగిన నెట్ సెషన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 దిశగా చర్చలు జరుగుతున్న తరుణంలో, ఈ సీనియర్ ద్వయం భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, నెట్స్ ప్రాక్టీస్‌లో మాత్రం వారు ఎలాంటి ఒత్తిడికి గురికానట్లు కనిపించారు.

కోహ్లీ, రోహిత్ ఇద్దరూ బ్యాక్-టు-బ్యాక్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై మ్యాచ్ గెలిపించే ప్రదర్శనలు చేసిన వెంటనే, ప్రాక్టీస్‌లో మరింత శ్రమించారు. ఈ సెషన్‌ను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దగ్గరగా పరిశీలిస్తూ నెట్ల మధ్యలో నిలబడి ఉన్నారు. కోహ్లీ తన బ్యాటింగ్ ముగించుకుని, గంభీర్ పక్కగా నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళిపోయారు. 

ఈ సందర్భంగా కోచ్‌తో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం భారత క్రికెట్‌లోని తాజా పరిణామాల దృష్ట్యా అందరి దృష్టిని ఆకర్షించింది. కోహ్లీ తర్వాత నెట్స్‌లోకి వచ్చిన రోహిత్, డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళే ముందు మాత్రం గంభీర్‌తో కాసేపు మాట్లాడారు.

66
రాయ్‌పూర్‌లో రో కో లపై భారీ అంచనాలు
Image Credit : ANI

రాయ్‌పూర్‌లో రో కో లపై భారీ అంచనాలు

దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 135 పరుగులతో తన 52వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. రోహిత్ శర్మ కూడా 57 పరుగులు చేసి, కోహ్లీతో కలిసి 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం బ్లాక్-సాయిల్ పిచ్‌పై రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా కోట్లాది మంది భారత అభిమానుల దృష్టి అంతా రోకో జోడీ పైనే ఉంది. మరో అద్భుతమైన ఇన్నింగ్స్ వీరి నుంచి వస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
కోహ్లీని తప్పించడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్..? అసలు నిజమిదే
Recommended image2
T20 World Cup : బ్యాట్ పడితే కోట్లు.. ఫోజు కొడితే లక్షలు! టీ20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ వీళ్లే
Recommended image3
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
Related Stories
Recommended image1
వీరి పేర్లు చెబితేనే బౌలర్లకు వణుకు.. కోట్లు కుమ్మరిస్తామంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
Recommended image2
డిసెంబర్ 7న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి? క్లారిటీ వచ్చింది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved