MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాకు ఉరి వేయండి.. 10 పైసలు కూడా తీసుకోలేదు, ఇవిగో సాక్ష్యాలు...Tv5 మూర్తి సంచలన వ్యాఖ్యలు

నాకు ఉరి వేయండి.. 10 పైసలు కూడా తీసుకోలేదు, ఇవిగో సాక్ష్యాలు...Tv5 మూర్తి సంచలన వ్యాఖ్యలు

తానేతప్పు చేయలేదని, ఆరోపణల్లో నిజం ఉంటే ''ఉరి తీయ్యండి'' అని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ Tv5 మూర్తి . ఎటువంటి సాక్ష్యాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారికి బుర్రతిరిగేలా సమాధానం ఇచ్చారు మూర్తి. 

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 06 2025, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Tv5 మూర్తి వివరణ..
Image Credit : Asianet News

Tv5 మూర్తి వివరణ..

తాజాగా సీనియర్ జర్నలిస్ట్ టీవీ5 మూర్తిపై ఓ కేసు నమోదు అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ తో పాటు, 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, తన భార్యతో తిరుగుతున్నాడంటూ.. నటుడు ధర్మసత్యసాయి మహేష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. తెలంగాణలోని కూకట్ పల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దాంతో పాటు పలు మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో మూర్తిపై వచ్చిన ఆరోపణలకు ఆయన స్పందించారు. ప్రతీ విషయాన్ని వివరంగా వెల్లడిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు మూర్తి.

26
ఆరోపణల్లో నిజం ఎంత..?
Image Credit : Asianet News

ఆరోపణల్లో నిజం ఎంత..?

జర్నలిస్ట్ మూర్తి మాట్లాడుతూ.. ''నాపై కొన్ని రోజులుగా కుట్ర జరుగుతోంది. ఒక సినిమా హీరో ( ధర్మ మహేష్) , ఆయన భార్య మధ్య మనస్పర్ధలు వస్తే.. అందులో నేనేదో ఎంటర్ అయ్యి.. వారిని బ్లాక్ మెయిల్ చేసి.. 10 కోట్లు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారికి సబంధించిన వార్తలు గతంలోనే అనేక మీడియాల్లో వచ్చాయి. టీవీ 5 లో కూడా వచ్చాయి. కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేశారు.. అందులో వైసీపీ కుట్ర ఉంది. ఆ అమ్మాయి కుటుంబం నాకు తెలుసు అని.. ఓ వైసీపీ ఎమ్మెల్సీ దగ్గరుండి ఇదంతా నడిపిస్తున్నారు. ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన దూరపు బంధువు, జర్నలిస్ట్ మిత్రుడు ఒకరు వారిని నాకు పరిచయం చేశారు. అప్పుడు ఆ అమ్మాయి అమ్మగారు, టీచర్, ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి.. నేనంటే అభిమానంతో గతంలోనే ఓ సారి రాఖీ కట్టింది. ఆ విషయం తరువాత నాకు గుర్తుకు వచ్చింది. వాళ్ల కుటుంబం నాకు బాగా తెలుసు కాబట్టి.. వాళ్లు నన్ను ఒకసారి ఆహ్వానిస్తే .. ఇంటికి వెళ్లాను. అప్పుడు వారితో కలిసి 30 మంది వరకూ ఉన్నారు. అది కూడా వాళ్లకు నాకు కామన్ ఫ్రెండ్, జర్నలిస్ట్ తో కలిసి వెళ్లాను. అంతే కానీ.. నేను ఆ అమ్మాయి రహస్యంగా కలవలేదు.. అందరు కలిసి కూర్చోని భోజనం చేశాం.. ఆ వీడియో వాళ్లు కూడా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. కానీ దాన్ని కట్ చేసి.. వైసీపీ సోషల్ మీడియాకు కావలసినంత వరకూ తీసుకుని, అబద్దపు ప్రచారం చేస్తున్నారు'' అని మూర్తి అన్నారు.

Related Articles

Related image1
బిగ్ బాస్ హౌస్ లో రౌడీల్లా కొట్టుకున్న కంటెస్టెంట్స్.. మండిపడుతున్న ఆడియన్స్, ట్విస్ట్ ఏంటంటే?
Related image2
10 కోట్ల లంచం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, సీనియర్ జర్నలిస్ట్ మూర్తి పై కేసు నమోదు
36
రాఖీ కట్టిన సోదరి కోసం గరళం మింగి కూర్చున్నాను..
Image Credit : Asianet News

రాఖీ కట్టిన సోదరి కోసం గరళం మింగి కూర్చున్నాను..

జర్నలిస్ట్ మూర్తి మాట్లాడుతూ.. '' వాళ్ల ఫ్యామిలీ బంధువు.. నాకు జర్నలిస్ట్ మిత్రుడు పరిచయం కాబట్టి.. ఓ సారి ఫంక్షన్ కు నన్ను ఆహ్వానిస్తే.. అందరితో కలిసి వెళ్లాను.. అందరితో గ్రూఫ్ ఫోట్ కూడా దిగాను. కానీ అందులో నాది, ఆ అమ్మాయిది ఫోటో మాత్రమే కట్ చేసి.. వాళ్ళు ఇష్టమొచ్చినట్టు కథలు అల్లి ప్రచారం చేస్తున్నారు. అక్కడ అంత మంది ఉన్నారు.. కానీ మేం రహస్యంగా కలిశామని ఆరోపణలు చేస్తున్నారు. కానీ నాకు ఆఅమ్మాయికి రకరకాలుగా సంబంధం అంటగడుతూ.. ప్రచారం చేస్తున్నారు. నేను వాళ్ల ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు అక్కడ 10 మంది పైనే ఉన్నారు. ఇదంతా వైసీపీ అధినేత సలహాతో.. వైసీపీ ఎమ్మెల్సీ చేస్తున్న కుట్ర. ఆ నటుడు కూడా కేసులు ఎదుర్కొలేక.. నాపై కుట్ర చేసి.. నా క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రచారం చేయాలని చూస్తున్నాడు. కానీ అందుకు సాక్ష్యాలు లేవు. కానీ వాళ్లు చేస్తున్న కుట్రకు, వాళ్లు చేసిన అక్రమాలకు నాదగ్గర సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కానీ అవి సమయం వచ్చినప్పుడు బయటపెడతా. ప్రస్తుతం ఆ అమ్మాయి తల్లి నన్ను రిక్వెస్ట్ చేసింది.. మా మధ్య కాప్రమైజ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. కాస్త ఏం మాట్లాడకండీ అని అడిగింది. దాంతో నేను కామ్ గా ఉన్నాను. ప్రస్తుతం గరళం మిగి కూర్చున్నాను. కానీ నాకు మా చైర్మెన్.. ఆయన ఫ్యామిలీ తిరుమల కొండంత అండగా ఉన్నారు. నన్ను నమ్మి నీ పని నువ్వు చేసుకో.. అని ధైర్యం ఇచ్చారు. అందకే నేను ఇలాంటివి పట్టిచుకోను.'' అని మూర్తి అన్నారు.

46
తల్లీ, చెల్లికి అన్యాయం చేసిన కుటుంబ..
Image Credit : Asianet News

తల్లీ, చెల్లికి అన్యాయం చేసిన కుటుంబ..

మూర్తి మాట్లాడుతూ.. ''సొంత చెల్లి మీద ట్రోల్ చేయించిన కుటుంబ.. తల్లిపైనే ట్రోల్ చేయించిన కుటుంబం... ప్రతిపక్ష నాయకుడి కుటుంబాన్ని అసెంబ్లీలో దారుణంగా అవమానించిన కుటుంబం, కోడెల శివప్రసాద్ ను ట్రోల్ చేయించి.. ఆత్మహత్య చేసుకునేలా చేసిన కుటుంబం.. డాక్టర్ సుధాకర్ మీద పిచ్చివాడు అని ముద్ర వేయించిన వారు.. వాయి వరుసలు లేని వ్యక్తులు.. ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేసి.. 29 ఏళ్ల చిన్న అమ్మాయితో నాకు అక్రమ సంబంధం అంటగట్టి.. నాపై కేసులు కూడా పెట్టిస్తున్నారు. కానీ వేటికీ నేను భయపడను.. ఎందుకుంటే సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టారని కోర్టే అడిగింది. అయినా సరే చిన్న కోర్డు నుంచి హైకోర్టు వరకూ వెళ్లారు. సాక్ష్యాలు ఉంటే ఇవ్వండి యాక్షన్ తీసుకుంటాము అని పోలీసులు కూడా అడిగారు. కానీ వాళ్లు ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోయారు.

56
1‌0 పైసలు తీసుకున్నా.. ఉరి వేయండి
Image Credit : Asianet News

1‌0 పైసలు తీసుకున్నా.. ఉరి వేయండి

మూర్తి పని అయిపోయింది.. టెలిఫోన్ ట్యాపింగ్ లో దొరికేశాడు అని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఏం కాలేదు, మూర్తిని ఎవరు ఏం చేయలేరు.. ఎన్ని ఆరోపణలు చేసినా... ఏం చేయలేరు. 10 కోట్లు అడిగినట్టు ఆరోపిస్తున్నారు.. నేను 10 రూపాయాలు కూడా ఎవరిని అడగలేదు. గతంలో కూడా ఓ జ్యోతీష్యుడిని అడ్డం పెట్టుకుని 5 కోట్లు డిమాండ్ చేశాడు..ఆత్మహత్యే శరణ్యం.. అని ప్రచారం చేశారు..కానీ అది నిరూపించలేకపోయారు. ఇది కూడా అంతే.. నేను 10 రూపాయలు కూడా ఎవరినీ అడగలేదు, మాఛైర్మెన్ ఇస్తున్న జీతభత్యాలమీదనే నేను బ్రతుకుతున్నాను. అంతే కానీ ఎవరినీ రూపాయి అడగను, ఆశించను. సాక్షిలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. నేను 10 కోట్లు డిమాండ్ చేశానని, గతంలో 5 కోట్లు అని వీరే రాశారు.. ఆతరువాత 15 కోట్లు అని కూడా వేస్తారు. కానీ నేను వాటికి భయపడను.. 10 పైసలు కూడా ఎవరిదగ్గర తీసుకోలేదు, పరుల సొమ్ము నాకు విషంతో సమానం. ఇక కేసులు అన్నీ ఫేక్, ఫాల్స్ కేసులు, అన్నీ బయటపెడతా, అవన్నీ ఫాల్స్ కేసులు. నేను 10 పైసలు తీసుకున్నట్టు తేలితే.. నాకు ఉరివేయండి.. అంతే కానీ ఆధారాలు లేని ఇలాంటి ఆరోపణలకు నేను భయపడను'' అంటూ.. సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేసీ.. ట్యాగ్ లైన్ రాశారు జర్నలిస్ట్ మూర్తి.

66
మూర్తిపై ఆరోపణలు, కేసు
Image Credit : Asianet News

మూర్తిపై ఆరోపణలు, కేసు

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రముఖ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు టీవీ5 మూర్తి. వివాదాస్పద అంశాలపై ఎప్పుడూ సూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు . విషయం ఏదైనా మొహమాటం లేకుండా, ముఖం మీదనే మాట్లాడటం.. సూటిగా సుత్తి లేకుండా చెప్పడం ఆయన స్పెషాలిటీ. ఈక్రమంలో నటుడు ధర్మసత్యసాయి మహేష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణలోని కూకట్ పల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గౌతమి చౌదరి అనే మహిళ తన భర్త మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించగా, టీవీ5 మూర్తి గౌతమి పక్షాన నిలబడి, ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలు టీవీ5లో ప్రసారమవగా, మహేష్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.తన అనుమతి లేకుండా తన ఇంటికి వస్తున్నాడని, తన భార్యతో అనుచిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపించాడు. అంతేకాక, తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత విషయాలను టీవీ5లో ప్రసారం చేశారని, తన ఫోన్ ట్యాప్ చేసి.. 10 కోట్లు డిమాండ్ చేశారని కూడా ఆరోపించాడు. దాంతో మూర్తిపై కోర్డు ఆదేశాలతో కేసు నమోదు అయ్యింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image3
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Related Stories
Recommended image1
బిగ్ బాస్ హౌస్ లో రౌడీల్లా కొట్టుకున్న కంటెస్టెంట్స్.. మండిపడుతున్న ఆడియన్స్, ట్విస్ట్ ఏంటంటే?
Recommended image2
10 కోట్ల లంచం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, సీనియర్ జర్నలిస్ట్ మూర్తి పై కేసు నమోదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved