MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి, శ్రీదేవి మధ్య గొడవల వల్ల ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? ఇద్దరి మధ్య ఏం జరిగింది?

చిరంజీవి, శ్రీదేవి మధ్య గొడవల వల్ల ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? ఇద్దరి మధ్య ఏం జరిగింది?

Chiranjeevi , Sridevi clash : మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కాంబోకు ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. స్క్రీన్ పై హిట్ పెయిర్ గా ఉన్న ఈ స్టార్ సెలబ్రిటీల మధ్య గోడవ జరిగి.. ఓ సినిమా ఆగిపోయిందని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 16 2025, 10:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి శ్రీదేవి సినిమాల క్రేజ్
Image Credit : Asianet News

చిరంజీవి - శ్రీదేవి సినిమాల క్రేజ్

టాలీవుడ్‌లో ఒకప్పుడు చిరంజీవి–శ్రీదేవి కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉండేది.. ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు తక్కువే అయినా, వాటి ప్రభావం ఇండస్ట్రీపై ఎక్కువగా పడింది. మరీ ముఖ్యంగా.. వీరిద్దరిక కాంబినేషన్ లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో.. ఆసినిమాను, వీరిద్దరి కాంబినేషన్ ను సినిమా ప్రేమికులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈసినిమా టీవీలో వస్తే.. ఈరోజుకీ.. కదలకుండా చూస్తారు ఆడియన్స్. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చూపించిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే ఈ సూపర్ హిట్ జోడీ మధ్య ఒక సందర్భంలో మనస్పర్థలు రావడంతో ఓ సినిమా పూర్తిగా ఆగిపోయింది.

25
నిర్మాతగా మారిన శ్రీదేవి..
Image Credit : Asianet News

నిర్మాతగా మారిన శ్రీదేవి..

చిరంజీవి, శ్రీదేవి కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఆతరువాత శ్రీదేవి బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. చేతి నిండా సంపాదించింది. ఈక్రమంలో ఆమెకు నిర్మాతగా మారాలని కోరిక పుట్టింది. దాంతో వెంటనే..తనకు చాలా ఇష్టమైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని సెలక్ట్ చేసుకుని. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నం చేసింది. ఆ సినిమా పేరు ‘వజ్రాల దొంగ’. ఈ చిత్రాన్ని శ్రీదేవి స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలో, ఆమె నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. టైటిల్ ప్రకటించడమే కాకుండా, ఓ పాట షూటింగ్ కూడా పూర్తయ్యింది.

Related Articles

Related image1
మూగమనసులు రివ్యూ.. సావిత్రి ప్రాణాలు కాపాడిన అక్కినేని నాగేశ్వరరావు, కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలవడానికి కారణం ఏంటి?
Related image2
ఐ బొమ్మ రవి ఏం చదువుకున్నాడో తెలుసా? టాలీవుడ్ కు చెమటలు పట్టించిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే?
35
చిరంజీవి , శ్రీదేవి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు..?
Image Credit : Asianet News

చిరంజీవి , శ్రీదేవి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు..?

అయితే వజ్రాలదొంగ సినిమా షూటింగ్ టైమ్ లోనే చిరంజీవి , శ్రీదేవి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయట. నిర్మాత కావడంతో.. శ్రీదేవి ఈ సినిమా కథను, పాత్రలను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హీరోగా ఉన్న చిరంజీవి తన పాత్రకు తగ్గట్టుగా ప్రాముఖ్యత లేకపోతే తాను ఈసినిమా చేయనని చెప్పేశారట. కథలో హీరో పాత్ర ఇంపార్టెన్స్ తగ్గకూడదని దర్శకుడికి ఆయన స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

45
ఆగిపోయిన వజ్రాలదొంగ సినిమా
Image Credit : Asianet News

ఆగిపోయిన వజ్రాలదొంగ సినిమా

ఈ అంశంలో ఇద్దరు మొండిపట్టుదల పట్టుకుని కూర్చోవడంతో.. పరిస్థితి మారిపోయింది. ప్రత్యక్షంగా గొడవలు, తిట్టుకోవడం వంటివి ఏమీ జరగకపోయినా, సినిమా కంటెంట్ విషయంలో వచ్చిన అసమ్మతి పెరిగిపోయింది. ఈ విషయంలో ఎవరు తగ్గకపోవడంతో.. చివరికి సినిమా నిలిచిపోయింది. అప్పటికే ఒక పాట షూట్ చేసినా, ‘వజ్రాల దొంగ’ సినిమా.. ఆతరువాత అసలు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది.

55
నిర్మాతగా వెనకడుకు వేసిన శ్రీదేవి.
Image Credit : Asianet News

నిర్మాతగా వెనకడుకు వేసిన శ్రీదేవి.

ఆ సంఘటన తర్వాత శ్రీదేవి మళ్లీ నిర్మాతగా సినిమాలు చేయలేదు. సినిమా నిర్మాణం అంటే అంత సులువైన పని కాదని ఆమెకు అర్ధం అయినట్టు ఉంది. ఆతరువాత కాలంలో ఆమె హీరోయిన్ గానే కొనసాగింది. అయితే బాలీవుడ్ కే పరిమితం అయ్యింది శ్రీదేవి. ఈ విషయాలన్నింటినీ ఓ సీనియర్ సినీ జర్నలిస్టు ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం. ఇక హీరోయిన్ గా సినిమాలు తగ్గిన తరువాత తన ఫ్యామిలీకి ఎక్కువగా టైమ్ కేటాయించిన శ్రీదేవి.. మామ్ సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత ఆమె దుబాయ్ లో ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లిన ఆమె.. అనుమానస్పద పరిస్థితుల్లో మరణించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Recommended image2
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
Recommended image3
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Related Stories
Recommended image1
మూగమనసులు రివ్యూ.. సావిత్రి ప్రాణాలు కాపాడిన అక్కినేని నాగేశ్వరరావు, కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలవడానికి కారణం ఏంటి?
Recommended image2
ఐ బొమ్మ రవి ఏం చదువుకున్నాడో తెలుసా? టాలీవుడ్ కు చెమటలు పట్టించిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved