MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025: డ్రీమ్11 బంద్.. యూజర్ల డబ్బుల సంగతేంటి?

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025: డ్రీమ్11 బంద్.. యూజర్ల డబ్బుల సంగతేంటి?

Online Gaming Bill 2025: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం లభించడంతో డ్రీమ్11, మై11సర్కిల్ వంటి యాప్‌లకు గట్టి షాక్ తగిలింది. ఇదే సమయంలో ఆయా యాప్ ల యూజర్లు తమ డబ్బు విత్‌డ్రా పై ఆందోళనల మధ్య కంపెనీలు స్పందించాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 21 2025, 11:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం
Image Credit : Gemini

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం

భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు రూపొందించిన ‘ప్రోమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు, 2025’కు లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన వెంటనే ఇది చట్టంగా మారనుంది. ఈ బిల్లుతో డ్రీమ్11, మై11సర్కిల్, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంఎపిఎల్), గేమ్స్‌క్రాఫ్ట్, జూపీ వంటి రియల్ మనీ గేమింగ్ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది.

25
డ్రీమ్11, డ్రీమ్ స్పోర్ట్స్ ఏం చెప్పింది?
Image Credit : stockphoto

డ్రీమ్11, డ్రీమ్ స్పోర్ట్స్ ఏం చెప్పింది?

డ్రీమ్ స్పోర్ట్స్ తమ ప్రధాన యాప్ డ్రీమ్11లోని అన్ని ‘పే టు ప్లే’ ఫాంటసీ గేమ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇటీవల ప్రారంభించిన డ్రీమ్ పిక్స్ యాప్, డ్రీమ్ ప్లే కాషువల్ గేమ్స్ యాప్‌లను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. 

డ్రీమ్11 యూజర్లకు ఇచ్చిన ప్రకటనలో “మీ ఖాతాలోని బ్యాలెన్స్ సురక్షితంగా ఉంది. ఎప్పుడైనా డ్రీమ్11 యాప్‌ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు” అని హామీ ఇచ్చింది. 2023 ఆర్థిక సంవత్సరంలో డ్రీమ్ స్పోర్ట్స్ రూ.6,384 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూలో రూ.188 కోట్ల నికర లాభం నమోదు చేసింది.

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్ గా ఉంది. ఈ సంస్థ రూ.358 కోట్లకు టీమిండియా టైటిల్ హక్కులు పొందింది. అలాగే, ఐపీఎల్ ఫాంటసీ గేమింగ్ హక్కులను రూ.625 కోట్లకు మై11సర్కిల్ సొంతం చేసుకుంది. పలువురు క్రికెటర్లతో ఒప్పందాలు చాలానే ఉన్నాయి. కొత్తగా తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 తో ఈ ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది.

Related Articles

Related image1
ఆసియా కప్ 2025: భారత జట్టు నిండా ఈ రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లే
Related image2
ఒంటరిగా గర్జించే సింహం నేను.. 2026 ఎన్నికలపై విజయ్ సంచలన ప్రకటన
35
ఎంఎపిఎల్ ఏం చర్యలు తీసుకుంది?
Image Credit : Harsh Jain | twitter

ఎంఎపిఎల్ ఏం చర్యలు తీసుకుంది?

రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంఎపిఎల్) కూడా తమ యాప్‌లో డబ్బుతో సంబంధమున్న అన్ని గేమ్స్‌ను నిలిపివేసింది. “ఇకపై కొత్తగా డబ్బు డిపాజిట్ చేయడం సాధ్యం కాదు. అయితే యూజర్లు తమ ఖాతాలో మిగిలిన బ్యాలెన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు” అని కంపెనీ అధికారులు తెలిపారు. ఎంఎపిఎల్‌లో ఫాంటసీ స్పోర్ట్స్, క్విజ్, పజిల్, బోర్డ్ గేమ్స్ వంటి 60 కంటే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి.

45
గేమ్స్‌క్రాఫ్ట్, జూపీ లు కూడా అదే బాటలో..
Image Credit : our own

గేమ్స్‌క్రాఫ్ట్, జూపీ లు కూడా అదే బాటలో..

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గేమ్స్‌క్రాఫ్ట్ తమ రమ్మీ యాప్ రమ్మీకల్చర్ లోని ‘ఆడ్ కాష్’, ‘గేమ్‌ప్లే’ సర్వీసులను నిలిపివేసింది. జూపీ కూడా తమ ప్లాట్‌ఫారమ్‌లోని రియల్ మనీ గేమ్స్‌ను నిలిపివేస్తోంది.

వినియోగదారుల డబ్బుల భద్రత పై స్పష్టత

ప్రస్తుతం యాప్‌లలో జమ చేసిన డబ్బు యూజర్లు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉందని కంపెనీలు స్పష్టత ఇచ్చాయి. కానీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యాప్‌లు పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉండటంతో, వినియోగదారులు వెంటనే తమ డబ్బును తీసుకోవాలని ఈ రంగం నిపుణులు సూచించారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ప్రకారం, ఉల్లంఘనలు చేసిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

55
ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ భవిష్యత్తు ఏమిటి?
Image Credit : ANI

ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ భవిష్యత్తు ఏమిటి?

ప్రస్తుతం భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ విలువ $3.7 బిలియన్. 2029 నాటికి ఇది $9.1 బిలియన్ కు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే ప్రస్తుత ఆదాయంలో 86% రియల్ మనీ గేమ్స్ ద్వారానే వస్తోంది. ఈ చట్టం అమల్లోకి రావడంతో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఇలాంటి లావాదేవీలకు సాయం చేయరాదని చట్టం పేర్కొంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : బ్యాట్ పడితే కోట్లు.. ఫోజు కొడితే లక్షలు! టీ20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ వీళ్లే
Recommended image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
Recommended image3
IND vs PAK : ఐసీసీ దెబ్బకు దారిలోకి వచ్చిన పాక్.. నవ్వులపాలవుతున్న నఖ్వీ డ్రామా
Related Stories
Recommended image1
ఆసియా కప్ 2025: భారత జట్టు నిండా ఈ రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లే
Recommended image2
ఒంటరిగా గర్జించే సింహం నేను.. 2026 ఎన్నికలపై విజయ్ సంచలన ప్రకటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved