MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India Pakistan tensions: పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దెబ్బకొట్టిన ఆపరేషన్ సింధూర్.. ఇక కష్టమే !

India Pakistan tensions: పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దెబ్బకొట్టిన ఆపరేషన్ సింధూర్.. ఇక కష్టమే !

India Pakistan tensions: పాకిస్థాన్‌ క్రికెట్ పై భారత్ దెబ్బ గట్టిగానే పడింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల అక్కడి క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీ ఇప్పుడు కోలుకోని విధంగా 5 గట్టి దెబ్బలు తగిలాయి. ఈ వివరాలు ఇప్పుడు గెలుసుకుందాం.

1 Min read
Mahesh Rajamoni
Published : May 11 2025, 12:47 AM IST| Updated : May 11 2025, 12:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

India Pakistan tensions: ఆపరేషన్ సింధూర్ తో మరోసారి పాకిస్థాన్‌కు జీవితాంతం మరవలేని గుణపాఠం చెప్పింది భారత్. మన సైన్యం ఉగ్రవాదులను మాత్రమే కాకుండా, వారి వెనుక ఉన్న వారిని కూడా శిక్షించింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును సైతం గట్టిగానే దెబ్బకొట్టింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు జరిగిన ఐదు  బిగ్ నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

26
1. పాక్ స్టేడియం దెబ్బతినడం

1. పాక్ స్టేడియం దెబ్బతినడం

భారత్ పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి చేసింది, దీనివల్ల అది దెబ్బతింది. ఈ నష్టం కారణంగా అక్కడ జరగాల్సిన PSL మ్యాచ్ కూడా రద్దు చేశారు. ఈ స్టేడియాన్ని ఇటీవలే 400 కోట్ల భారతీయ రూపాయలతో నిర్మించిన్ సంగతి తెలిసిందే. 

Related Articles

Related image1
India Pakistan Tensions: జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు.. బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి
Related image2
India Pakistan: కాల్పుల విరమణ ఉల్లంఘన.. పాకిస్తాన్ కు భార‌త్ వార్నింగ్
36
2. భారత్-పాక్ క్రికెట్ పై ప్రభావం

2. భారత్-పాక్ క్రికెట్ పై ప్రభావం

భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ బ్లాక్ బస్టర్. కానీ, ఇప్పుడు దానిపై కూడా ప్రమాదం పొంచి ఉంది. పాకిస్థాన్ ప్రవర్తన కారణంగా BCCI పాక్ తో టోర్నమెంట్లు ఆడలేకపోతుంది. ICC టోర్నమెంట్లలో రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచకపోవచ్చు. అలాగే, భారత్ పాకిస్తాన్ తో ఐసీసీ టోర్నీలలో కూడా ఆడకూడదని చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. 

46
3. విదేశీ క్రికెటర్ల కష్టాలు

3. విదేశీ క్రికెటర్ల కష్టాలు

భారత దాడి వల్ల పాకిస్థాన్ క్రికెటర్ల పరిస్థితి దారుణంగా ఉంది, అక్కడ PSL కోసం వెళ్ళిన విదేశీయులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారు ఎలాగైనా పాకిస్థాన్ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. PCB ఇకపై PSL నిర్వహించే ధైర్యం చేయలేకపోవచ్చు.

56
4. PSL దుబాయ్ కి మార్పు

4. PSL దుబాయ్ కి మార్పు

పాకిస్థాన్‌లో భద్రత లేకపోవడం, అక్కడి పరిస్థితుల దృష్ట్యా PCB PSLను దుబాయ్‌కు మార్చాలని నిర్ణయించింది. మిగిలిన మ్యాచ్‌లన్నీ అక్కడే జరుగుతాయి. అయితే, దుబాయ్ ఖర్చులు పాకిస్థాన్ కంటే చాలా ఎక్కువ. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. 

66
5. PCB ఆర్థిక ఇబ్బందులు

5. PCB ఆర్థిక ఇబ్బందులు

ఇప్పటికే PCB ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అక్కడి స్టేడియంలకు ప్రేక్షకులు రావడం లేదు, ఇప్పుడు మ్యాచ్‌లే నిలిచిపోయాయి. దీంతో వారి ఇబ్బందులు మరింత పెరిగాయి. భవిష్యత్తులో భారత్ దయ కోసం వారు వేడుకోవాల్సి రావచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పాకిస్తాన్
యుద్ధం
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
Latest Videos
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved