MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఓలా, ఉబర్, రాపిడో కొత్త రూల్స్: రైడర్లు రద్దు చేస్తే కస్టమర్లకు ఫైన్ కట్టాలి

ఓలా, ఉబర్, రాపిడో కొత్త రూల్స్: రైడర్లు రద్దు చేస్తే కస్టమర్లకు ఫైన్ కట్టాలి

ఓలా, ఉబర్, రాపిడో బుక్ చేసుకుని మనం క్యాన్సిల్ చేశామనుకోండి క్యాన్సిలేషన్ ఛార్జ్ వసూలు చేస్తారు కదా.. అదే డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి ఛార్జ్ వసూలు చేయరు. ఇప్పుడు ఈ విషయంపై కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులకు లాభం కలుగుతుంది. ఆ రూల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.  

2 Min read
Naga Surya Phani Kumar
Published : May 03 2025, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ కాలంలో మొబైల్ మన జీవితంలో ఎలా అయితే ఒక భాగం అయిపోయిందో ఓలా, ఉబర్, రాపిడో లాంటి ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కూడా ప్రతి రోజు ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. బస్సుల్లో ఖాళీ ఉండదు. సొంత వెహికల్ లో వెళ్దామంటే ట్రాఫిక్ లో నడపడం చాలా కష్టం. మెట్రోలో త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కాని ఆ స్టేషన్ల వద్దకు వెళ్లాలన్నా కష్టమే. అందుకే ఓలా, ఉబర్, రాపిడో వంటి ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ ఎంత ఉపయోగంగా ఉంటున్నాయి. 
 

25

ఓలా, ఉబర్, రాపిడో ల్లో ఛార్జ్ కూడా తక్కువగా ఉండటంతో సొంతంగా ఆటోలు, కార్లు అద్దెకు తీసుకోవడం మానేశారు. దీనికి తగ్గట్టుగానే ఆయా కంపెనీలు కస్టమర్లకు సౌకర్యవంతమైన రైడ్లు అందిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కస్టమర్లు తమ అవసరాల రీత్యా బుక్ చేసుకున్న రైడ్ ను క్యాన్సిల్ చేస్తుంటారు. దీంతో కంపెనీలు తర్వాత రైడ్ బుక్ చేసినప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా వసూలు చేస్తుంటాయి. 
 

Related Articles

Related image1
ఏసీ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో 50 % వరకు డిస్కౌంట్ ఆఫర్స్
Related image2
సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుందా? రూ.56,100 జీతం వచ్చే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది
35

అయితే అదే రైడ్ ను రైడర్ లేదా డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే మాత్రం ఎలాంటి ఛార్జ్ ఉండదు. కస్టమర్లకు టైమ్ వేస్ట్ అవడం తప్ప మళ్లీ ఇంకో వెహికల్ బుక్ చేసుకోక తప్పదు. 

కస్టమర్లకు కలుగుతున్న ఇలాంటి ఇబ్బందులను తొలగించేలా మహారాష్ట్ర ప్రభుత్వం ఓలా, ఉబర్, రాపిడో సంస్థలకు కొత్త రూల్స్ పెట్టింది. ఇకపై ఇలా రైడర్లు లేదా డ్రైవర్లు కన్ఫర్మ్ అయిన రైడ్ లను క్యాన్సిల్ చేస్తే ఫైన్ కట్టాలని రూల్ పెట్టింది. 

45

ప్రయాణికుల విలువైన సమయం వేస్ట్ చేసినందుకు గాను తగిన పరిహారం ఆ కస్టమర్ అకౌంట్ కి పంపాలని ఈ రూల్ చెబుతోంది. దీని వల్ల రైడర్లు అకారణంగా రైడ్ లను క్యాన్సిల్ చేయకుండా ఉంటారని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 
 

55

ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలోనూ ఈ రూల్ అమలు చేయాలని జనం కోరుతున్నారు. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved