ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో టెన్షన్ పెరిగింది. దీంతో ఇండియాలో సెక్యూరిటీ పెంచారు. పంజాబ్, బెంగాల్ లో సెలవులు రద్దు చేశారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భయంతో వణికిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఏ క్షణంలో ఎలాంటి దొంగబుద్ధి చూపించి విపరీత చర్యలకు పాల్పడుతుందో అని భారత ప్రభుత్వం అప్రమత్తమవుతుంది.జమ్మూ కాశ్మీర్ నుండి రాజస్థాన్ వరకు అప్రమత్తంగా ఉన్నారు. పంజాబ్ ప్రభుత్వం అధికారులందరి సెలవులు రద్దు చేసింది. అనుమతి లేకుండా డ్యూటీ స్టేషన్ వదిలి వెళ్ళకూడదని ఆదేశించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డాక్టర్ల సెలవులు కూడా రద్దు చేశారు.

ఉద్యోగుల సెలవులు రద్దు 

బెంగాల్ ప్రభుత్వం కూడా ఉద్యోగులందరి సెలవులు రద్దు చేసింది. పంజాబ్ లో సీఎం భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో సరిహద్దులో డ్రోన్ల ద్వారా జరుగుతున్న స్మగ్లింగ్ ఆపడానికి అధునాతన యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనాలని నిర్ణయించారు. 532 కి.మీ. పొడవైన సరిహద్దులో 9 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారు.

స్కూళ్ళు, కాలేజీలు శనివారం వరకు బంద్

యుద్ధం లేదా ఉగ్రవాద దాడుల్లో గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగఢ్ లలో గురువారం స్కూళ్ళు, కాలేజీలు శనివారం వరకు బంద్ అని ప్రకటించారు. అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ, జలంధర్ NIT మే 16 వరకు బంద్.కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు మే 11 వరకు సెలవులు ప్రకటించాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులను ఇళ్లకు వెళ్ళనిచ్చింది. జలంధర్ పోలీసులు ప్రైవేట్ సంస్థలను కూడా మూసివేయాలని ఆదేశించారు.

20 కి.మీ. దూరంలోని గ్రామాలను ఖాళీ చేయించారు

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో సరిహద్దుకు 20 కి.మీ. దూరంలోని గ్రామాలను ఖాళీ చేయించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సరిహద్దు జిల్లాల్లో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు బంద్ అవుతాయని తెలుస్తుంది.