Biden on Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ యుద్ధ నేరస్థుడని, యుద్ధ నేరాలకు పాల్పడ్డరని, పుతిన్ పై తప్పని సరిగా.. యుద్ధ నేరాల విచారణ జరపాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ డిమాండ్ చేశారు ఉక్రెయిన్లోని బుచా ప్రాంతం పౌరులపై జరిపిన మరణహోమాన్ని తీవ్రంగా ఖండించారు. రష్యాపై మరిన్ని అదనపు ఆంక్షలు విధించాలని ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు.
Biden on Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) పై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ యుద్ధ నేరస్థుడని.. యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడన్న అభియోగంపై పుతిన్పై విచారణ జరుపాలని జో బైడెన్ ( Biden) ఆరోపించారు. ఉక్రెయిన్లోని బుచ పట్టణంలో పౌరులపై జరిగిన హత్యాకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. బుచలో ఏం జరిగిందో మీరంతా చూస్తున్నారని వైట్హౌస్లో మీడియాతో చెప్పారు. యుద్ధ నేరాల విచారణకు పిలుపునిచ్చారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని కోరుకుంటున్నట్లు జో బిడెన్ చెప్పారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరస్థుడని, యుద్ధ నేరాలకు పాల్పడ్డడాని, పుతిన్ పై తప్పని సరిగా.. యుద్ధ నేరాల విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బిడెన్ గతంలో మిస్టర్ పుతిన్ను యుద్ధ నేరస్థుడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్యా సైన్యం నుండి తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బుచ పట్టణంలో సామూహికంగా సమాధి చేసిన మృతదేహాలు బయట పడ్డాయి.వందలాది పౌర దుస్తులలో శవాలను కనుగొన్నారు. మృత దేహాల చేతులు బంధించినట్టు తెలుస్తోంది. పరిశోధన ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యాపై అదనపు ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సిద్ధమయ్యాయి. మేం సమాచారం సేకరించాల్సి ఉంది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. వాస్తవంగా పుతిన్ యుద్ధ నేరాలపై విచారణ జరుపాలి. పుతిన్ క్రూరుడు. రష్యాపై యుద్ధం చేయడానికి అవసరమైన ఆయుధాలను ఉక్రెయిన్కు మేం అందజేస్తూనే ఉంటాం. బుచ పట్టణంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అని చెప్పారు.
ఈ ఘటనపై ఉక్రేనియన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనెడిక్టోవా మాట్లాడుతూ.. రష్యా దళాలు వెనక్కి తగ్గిన తర్వాత కైవ్ ప్రాంతంలో 410 పౌరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బుచా మరణాహోమాన్ని ప్రపంచదేశాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ, బుచ పట్టణంతోపాటు ఉక్రెయిన్లో పౌరులను హత్య చేశామన్న ఆరోపణలను రష్యా నిరాకరిస్తున్నది. క్రెమ్లిన్ కైవ్ సమీపంలో పౌరులను చంపడానికి రష్యన్ దళాలు కారణమని ఆరోపణలను క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తిరస్కరించారు. ఆరోపణలన్ని అవాస్తమని, వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని తెలిపారు.
పౌర మరణాలను అంతర్జాతీయ నాయకులు మారణహోమంగా పరిగణిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఇవి యుద్ధ నేరం, దీనిని జాతి నిర్మూలనగా ప్రపంచం గుర్తిస్తుందని బుచాను సందర్శించినప్పుడు Mr. Zelensky అన్నారు. బుచా మరణాహోమంపై పోలిష్ ప్రధాన మంత్రి మాటెస్జ్ మొరావికీ స్పందించారు. దీనిని జాతి నిర్మూలన చర్య పేర్కొన్నారు. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తునకు పిలుపునిచ్చారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి రష్యాను సస్పెండ్ చేయాలని కోరుతామని యుఎస్ తెలిపింది. రష్యాపై కఠినమైన ఆంక్షలపై అత్యవసర చర్చలు జరుగుతున్నాయని ఇయు విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ చెప్పారు. ఇదిలావుండగా, రష్యా దాడి నేపథ్యంలో దాదాపు 4.2 మిలియన్లకు పైగా ఉక్రెయిన్ శరణార్థులు దేశం విడిచిపెట్టారని, మానవతా పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
