MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana Cabinet: బీసీలకు 42% రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

Telangana Cabinet: బీసీలకు 42% రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

Telangana Cabinet: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, వివిధ శాఖ పనితీరుపై చర్చించారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

1 Min read
Mahesh Rajamoni
Published : Jul 10 2025, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Image Credit : ANI

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

తెలంగాణ ప్రభుత్వం పాలనలో మరో కీలక మైలురాయిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ఈ సమావేశ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

26
పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్
Image Credit : ANI

పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పులతో రాష్ట్రంలోని గ్రామీణ పాలన మరింత సమర్థవంతంగా మారనుంది. కొత్త చట్టంతో గ్రామ సభల ప్రాముఖ్యత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Articles

Related image1
India vs England: లార్డ్స్‌లో టాస్ పడిన వెంటనే ఈ ప్లేయర్ కు షాక్ తగిలింది !
Related image2
Amazon Prime Day 2025: iPhone 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు
36
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
Image Credit : X/Revanth Reddy

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనిపై ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేయనుందని సమాచారం. దీని కోసం ఇప్పటికే అసెంబ్లీని గవర్నర్ ప్రోరోగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది.

46
ఎన్నికల షెడ్యూల్ పై దృష్టి
Image Credit : ANI

ఎన్నికల షెడ్యూల్ పై దృష్టి

సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ పై ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా రిజర్వేషన్ల అమలు కీలక అంశమవుతుంది.

56
వర్షాకాలంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం
Image Credit : ANI

వర్షాకాలంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

వర్షాకాలం నేపథ్యంలో తగిన ముందస్తు చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. వరదల బీభత్సాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపైనా సమీక్ష చేపట్టారు.

66
18 సమావేశాల్లో 327 అంశాలపై చర్చ
Image Credit : ANI

18 సమావేశాల్లో 327 అంశాలపై చర్చ

ప్రస్తుతం వరుసగా 18 కేబినెట్ సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో 327 అంశాలు చర్చకు వచ్చి, 321 అంశాలకు ఆమోదం లభించిందని వివరించారు. మొత్తం 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 25న మరోసారి కేబినెట్ సమావేశం జరగనుందని తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
అనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved