MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 1500లకు అసిస్టెంట్‌గా చేసి, ఇప్పుడు 100కోట్లు తీసుకుంటూ ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

1500లకు అసిస్టెంట్‌గా చేసి, ఇప్పుడు 100కోట్లు తీసుకుంటూ ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

హీరోలు ఇప్పుడు వంద కోట్లు తీసుకోవడం కామన్‌ అయిపోయింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో చాలా మంది వంద కోట్లు తీసుకుంటున్నారు. కానీ దర్శకులు వంద కోట్ల పారితోషికం తీసుకోవడం చాలా అరుదు. 

2 Min read
Aithagoni Raju
Published : Jun 30 2025, 09:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరోలే కాదు దర్శకులకు కూడా వంద కోట్ల పారితోషికం
Image Credit : x/rajeshmanne

హీరోలే కాదు దర్శకులకు కూడా వంద కోట్ల పారితోషికం

ప్రస్తుతం భారతీయ సినిమా రేంజ్‌ పెరిగింది. ఒకప్పుడు వంద కోట్లు వసూలు చేస్తే గొప్పగా భావించేవారు. ఆ తర్వాత ఐదు వందల కోట్లు కామన్‌ అయిపోయింది. అంతేకాదు ఈ రెండు మూడేళ్లలో వెయ్యి కోట్లు కూడా లైట్‌ అయిపోయింది. 

రెండు వేల కోట్లు టార్గెట్‌ చేసే పరిస్థితిలో ఉంది. ఇక హీరోల పారితోషికం కూడా అదే మారిదిగా పెరుగుతుంది. ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌, రజనీకాంత్‌, షారూఖ్‌ ఖాన్‌ వంటి హీరోలు రూ.150-200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. 

అయితే వీరి జాబితాలో ఇప్పుడు దర్శకులు కూడా చేరిపోయారు. తాజాగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంద కోట్లు తీసుకోవడం విశేషం.  మరి ఆయన ఎవరో తెలుసుకుందాం. 

25
రూ.1500 జీతంతో కెరీర్‌ స్టార్ట్ చేసిన సుకుమార్‌
Image Credit : our own

రూ.1500 జీతంతో కెరీర్‌ స్టార్ట్ చేసిన సుకుమార్‌

రూ.1500 జీతంతో కెరీర్‌ని ప్రారంభించిన ఒక దర్శకుడు ఇప్పుడు వంద కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు క్రియేటివ్‌ జీనియస్‌గా పేరుతెచ్చుకున్న సుకుమార్‌ కావడం విశేషం. 

సుకుమార్‌ `ఆర్య` సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. అల్లు అర్జున్‌, దిల్‌ రాజు ఆయనకు లైఫ్‌ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ మూవీతో తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్నారు. 

 ఆయన తొలి పారితోషికం అందుకుంది మాత్రం `హనుమాన్‌ జంక్షన్‌` మూవీతోనే. అంతకు ముందే ఎడిటర్‌ మోహన్‌ వద్ద పనిచేశారు, రెండు మూడు సినిమాలకు రైటింగ్‌లో సహకరించారు.  

Related Articles

Related image1
బాలకృష్ణ సినిమా ఓపెనింగ్‌కి గెస్ట్ గా నాగార్జున.. కెమెరా ఆన్‌ చేసి విష్‌ చేస్తే, రిజల్ట్‌ ఏంటో తెలుసా?
Related image2
ఎంత మంది సూపర్‌ స్టార్‌లు, మెగాస్టార్‌లు వచ్చినా చెక్కుచెదరని ఎన్టీఆర్‌ ఆ రికార్డు, 60ఏళ్లుగా పదిలం
35
`హనుమాన్‌ జంక్షన్‌` చిత్రానికి అసిస్టెంట్‌గా చేసిన సుకుమార్‌
Image Credit : x/production house

`హనుమాన్‌ జంక్షన్‌` చిత్రానికి అసిస్టెంట్‌గా చేసిన సుకుమార్‌

`ఎమ్‌రాజా దర్శకత్వంలో ఎడిటర్‌ మోహన్‌ సమర్పణలో వచ్చిన `హనుమాన్‌ జంక్షన్‌` చిత్రంలో అర్జున్‌, జగపతిబాబు, వేణు తొట్టెంపూడి హీరోలుగా నటించారు. స్నేహ, లయ హీరోయిన్లుగా నటించారు. 

ఇందులో కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఈ శనివారం(జూన్‌28న) ఈ మూవీ రీ రిలీజ్‌ అయ్యింది. దీనికి మంచి ఆదరణే దక్కింది. ఈ మూవీతోనే సుకుమార్‌కి అసిస్టెంట్‌గా మంచి గుర్తింపు దక్కింది. 

ఈ మూవీకి అసిస్టెంట్‌గా పనిచేసినందుకు ఆయనకు రూ.1500 పారితోషికం ఇచ్చారట. ఆ తర్వాత రెండు మూడు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన సుకుమార్‌ `ఆర్య`తో దర్శకుడి ఎంట్రీ ఇచ్చారు.

45
`పుష్ప 2`కి వంద కోట్ల పారితోషికం అందుకున్న సుకుమార్‌
Image Credit : our own

`పుష్ప 2`కి వంద కోట్ల పారితోషికం అందుకున్న సుకుమార్‌

ఇక ఇటీవల అల్లు అర్జున్‌తో `పుష్ప2` సినిమా చేశారు. `పుష్ప`కి రెండో పార్ట్ గా ఈ మూవీ వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 `బాహుబలి 2` రికార్డులను కూడా బ్రేక్‌ చేసింది. ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసి ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది. ఈ మూవీకిగానూ సుకుమార్‌ తీసుకున్న పారితోషికం ఏకంగా రూ.100 కోట్లు. 

అయితే ఈ మూవీ నిర్మాణంలోనూ తన బ్యానర్‌ సుకుమార్‌ రైటింగ్స్ భాగమైంది. ఆయన పారితోషికం తీసుకోలేదు. కలెక్షన్లలో షేర్‌ తీసుకున్నారు. అలా ఆయన వాటా కింద వంద కోట్లకుపైగానే వచ్చిందని సమాచారం. అంతేకాదు ఈ చిత్రంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగారు సుకుమార్‌.

55
నెక్ట్స్ రామ్‌ చరణ్‌ తో సినిమా చేయబోతున్న సుకుమార్‌
Image Credit : our own

నెక్ట్స్ రామ్‌ చరణ్‌ తో సినిమా చేయబోతున్న సుకుమార్‌

`పుష్ప 2` తర్వాత ఇప్పుడు బ్రేక్‌ తీసుకున్నారు సుకుమార్‌. ఇప్పుడు నెక్ట్స్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ఆయన రామ్‌ చరణ్‌తో సినిమా చేయబోతున్నారు. 

దీనికి సంబంధించిన కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారు సుకుమార్‌. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ అనంతరం సుకుమార్‌ చిత్రం పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved